పేద విద్యార్థుల చదువుకు అండగా వుండి వారికి ఆర్థిక చేయూత అందించే దిశగా -PKVSS
పేద విద్యార్థుల చదువుకు అండగా వుండి వారికి ఆర్థిక చేయూత అందించే దిశగా
ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం పని చేస్తుంది.
ఈ మధ్య కాలంలో కారంచేడు గ్రామంలో టిఫెన్ బండి నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న పేద కమ్మ విద్యార్థికి గుంటూరు మాస్టర్ మైండ్ లో సి ఎ చదువుకు కమ్మ సంఘం
50000/- రూపాయలు సాయం అందించింది.
తండ్రి పిడుగు పాటుతో మరణించిన కొండపి మండలం కట్టా వారి పాలెం గ్రామానికి చెంది సీనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థిని బెజవాడ బ్రాహ్మణి కి 30000/-రూపాయలు
ఒంగోలుకు చెందిన సీనియర్ ఇంటర్ విద్యార్థిని యేటుకూరి సాయి సాత్విక చౌదరికి 30000/-రూపాయలు
ఒంగోలు ఇందిరా ప్రియ దర్శిని కళాశాలలో లా చదువు కోసం యస్ సి వర్గం
విద్యార్థిని తాటిపర్తి దివ్య కు 35000/-రూపాయలు మరియు
ఒంగోలు కమ్మ పాలెం కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దొండపాటి హాసిని కి లాప్టాప్ ను సమకూర్చి సహాయం అందించడం జరిగింది.




ఆత్మీయ సమావేశం...
No comments